తొట్టంబేడు నవంబర్ 15, పున్నమి న్యూస్ : తొట్టంబేడు మండలంలోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత,కవి, రచయిత, మిమిక్రీ కళాకారులు కయ్యూరు బాలసుబ్రమణ్యం అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా నియమితులయ్యారని జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ నాగభూషణం ప్రకటించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కయ్యూరు బాలు మాట్లాడుతూ… సాహిత్య, సాంస్కృతిక పరంగా తను సంస్థకు సేవలు అందిస్తానని వర్థమాన కవులు, కళాకారులను సంస్థ వేదికగా ప్రోత్సాహిస్తానని తనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ నాగభూషణం గార్లకు బాలు తన ధన్యవాదాలు తెలిపారు.

శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా కయ్యూరు బాలు
తొట్టంబేడు నవంబర్ 15, పున్నమి న్యూస్ : తొట్టంబేడు మండలంలోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత,కవి, రచయిత, మిమిక్రీ కళాకారులు కయ్యూరు బాలసుబ్రమణ్యం అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా నియమితులయ్యారని జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ నాగభూషణం ప్రకటించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కయ్యూరు బాలు మాట్లాడుతూ… సాహిత్య, సాంస్కృతిక పరంగా తను సంస్థకు సేవలు అందిస్తానని వర్థమాన కవులు, కళాకారులను సంస్థ వేదికగా ప్రోత్సాహిస్తానని తనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ నాగభూషణం గార్లకు బాలు తన ధన్యవాదాలు తెలిపారు.

