శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ఆధ్వర్యంలో విశాఖ హుడా చిల్డ్రన్ థియేటర్లో కిడ్స్ డే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. చిన్నారుల సృజనాత్మక ప్రతిభ, ఉత్సాహం, ఆనందం అచ్చొత్త వాతావరణాన్ని సృష్టించాయి.
ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వినూత్న హస్తకళలు, బొమ్మలు, చిత్రాలు, వంటకాలు, అలంకరణలు, పండ్ల ప్రదర్శనలు వంటి అనేక ఆకర్షణీయ అంశాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పిల్లల సృజనాత్మకతను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ పి. అనురాధ, ఇంగ్లీష్ హెచ్ఓడి ఇ. జ్యోతి, రచయిత శ్రీ రామానుజం, వర్క్షాప్ డైరెక్టర్ సుజాత, వనితా మూర్తి తదితరులు హాజరయ్యారు.
వారంతా పిల్లల సృజనాత్మకత, ఉత్సాహం, చైతన్యం పట్ల మెచ్చుకున్నారు.
డాక్టర్ పి. అనురాధ మాట్లాడుతూ – “నేటి తరం పిల్లలు టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ అదే సమయంలో ప్రకృతితో మమేకమవడం, ఆటలతో జీవన పాఠాలు నేర్చుకోవడం కూడా అవసరం. తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి” అని సూచించారు.
రచయిత శ్రీ రామానుజం మాట్లాడుతూ – “కథలు చెప్పడం ఒక కళ. కథల ద్వారా మనసును, మన సంస్కృతిని అర్థం చేసుకోవచ్చు. పిల్లల్లో పఠనాభిరుచి పెంపొందించడం అవసరం” అన్నారు.
వర్క్షాప్ డైరెక్టర్ సుజాత మాట్లాడుతూ – “చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీయడం, ప్రోత్సహించడం విద్యాసంస్థల ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు.
పిల్లలు “వెల్కమ్ డ్యాన్స్”, “బాప్ బాప్”, “కృష్ణ”, “ఫ్రూట్ షేక్”, “మెక్డొనాల్డ్”, “యెస్ ఐ క్యాన్”, “ఓ మై ఫ్రెండ్ గణేశా” వంటి నృత్య ప్రదర్శనలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
చివరగా ప్రధాన నిర్వాహకులు అతిథులకు ధన్యవాదాలు తెలుపుతూ పిల్లల ప్రతిభను అభినందించారు.
కార్యక్రమం ఆనందభరిత వాతావరణంలో ముగిసింది.


