*సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా (4,59,394) రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
సీఎం సహాయనిది పేదలకు ఒక వరం లాంటిదని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.ఈరోజు శివాజీపాలెం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 4 గురు లబ్ధిదారులకు నాలుగు లక్షల 59 రూపాయల (4,59,394) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , డిప్యూటీ CM శ్రీ పవన్ కళ్యాణ్ సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు .
*31 వార్డు* : 31 వ వార్డు చెందిన సింగంపల్లి పద్మ కి 1,07,233 చెక్కును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అందజేశారు. కార్యక్రమంలో స్టేట్ ఆర్యవైశ్య డైరెక్టర్ శ్రీమతి రూప , టిడిపి సీనియర్ నాయకురాలు శ్రీమతి గాయత్రి , సీనియర్ నాయకులు రాజేష్ గారు, చందు , కూటమి వార్డు ఇంచార్జ్ డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ , నాని పాల్గొన్నారు.
*39 వార్డు* : 39వ వార్డు కు చెందిన చెందిన పర్వీన్ సుల్తానా 67, 983/- రూపాయలు మరియు బుడ్డేడ వెంకట రావు కి 1,34,018/- రూపాయల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివప్రసాద్ రెడ్డి , ఎస్ కే ఎమ్ ఎల్ మాజీ చైర్మన్ శ్రీమతి సింహాచలం , కూటమి సీనియర్ నాయకులు దానేష్ , శ్రీను , రాజు, కోటమ్మ , సింగ్ , హీరా , హరి , సింగ్ , ఇతర నాయకులు పాల్గొన్నారు.
అదేవిధంగా నగర పరిధిలో ఉన్న బండి హరీష్ కి 1,50,160 చెక్కును ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు అందజేశారు .కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 33 వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి వసంత లక్ష్మి జీకే దంపతులు, మాజీ కార్పొరేటర్ శ్రీ ఉమామహేశ్వర , జనసేన సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త శ్రీ చీకటి రమేష్ , సీనియర్ నాయకులు తేజ , శ్రీధర్ , సురేష్ , ఇతర నాయకులు పాల్గొన్నారు..


