తిరుపతి ఆగస్టు12 పున్నమి ప్రతినిధి
శ్రీ పద్మావతి ఆడిటోరియంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన దినోత్సవ వేడుకలకు శక్తిగురు పూజ్యశ్రీ మాతాజీ వారు ముఖ్య అతిథిగా విచ్చేసి అనుగ్రహ భాషణం అనుగ్రహించారు.
మంత్ర పఠనం ద్వారా మనఃశుద్ధి, ధ్యానం ద్వారా ఏకాగ్రత, ఆలయ సందర్శన ద్వారా దివ్యశక్తి చేకూరుతాయని తెలియజేశారు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని, చెడు ఆలోచనలు అశాంతిని కలిగిస్తాయని వివరించారు.
భగవంతునిపై పరిపూర్ణ విశ్వాసంతో మనసును జయిస్తే ఎటువంటి కష్టాన్నైనా అధిగమించే దివ్యజ్ఞానం లభిస్తుందని అనుగ్రహించారు.
విద్యార్థులు వెలిబుచ్చిన పలు సందేహములకు పూజ్యశ్రీ మాతాజీ వారు మార్గదర్శనం చేశారు.
పోస్టర్ ప్రెజెంటేషన్, వ్యాసరచన, చర్చావేదిక, క్విజ్ పోటీల విజేతలకు పూజ్యశ్రీ మాతాజీ వారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు, బహుమతులు అందజేయబడ్డాయి.





