చిట్వేల్ మండలంలో నలుగురికి రూ.6.52 లక్షల చెక్కుల పంపిణీ
చిట్వేల్, అక్టోబర్ 31పున్నమి ప్రతినిధి
ప్రజల కష్టసుఖాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్న వారికి భరోసానిస్తుంది ముఖ్యమంత్రి సహాయనిధి. ఈ క్రమంలో చిట్వేల్ మండల పరిధిలో నలుగురు అర్హులైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శుక్రవారం అందజేశారు.
తిమ్మయ్యపాలెం పంచాయతీ పరిధిలోని గట్టుమీదపల్లి గ్రామానికి చెందిన తుపాకుల నాగభూషణంకు రూ.68,987,
పోల్లోపల్లి పంచాయతీ పరిధిలోని బోయపల్లి గ్రామానికి చెందిన జల్లి సుజాతకు రూ.4,50,000,
మైలపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డికు రూ.1,18,881,
చిట్వేల్ హరిజనవాడకు చెందిన సింగనమల సుబ్రహ్మణ్యంకు రూ.14,000 మొత్తంలో చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రజల కష్టసుఖాలకు అండగా నిలవడం కూటమి ప్రభుత్వ ధ్యేయం. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ప్రజల నమ్మకానికి ప్రతీక. ప్రతి అర్హుడికి ప్రభుత్వం సహాయం చేరేలా కృషి చేస్తున్నాం అన్నారు.
రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఆయన సతీమణి ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ సాధారణ కుటుంబాలకు ఆశ, ధైర్యాన్ని ఇస్తోంది. ఇది ప్రభుత్వం ప్రజల పట్ల చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలోమాదాసు నరసింహ, ఏదోటి రాజశేఖర్ నాయుడు, సత్యనారాయణ నాయుడు, వెంకటేశ్వర్లు నాయుడు, తుపాకుల పెంచలయ్య, షేక్ రియాజ్, మద్దూరి మన్మధ, సువారపు నాగేష్, పెద్దమ్మ గారి సాయి, సింగిరి సుబ్రమణ్యం, దాది రామచంద్ర, బండారు మణికంఠ, కొత్తూరు ఈశ్వరయ్య, యానాది రాజు, హరి నాయుడు, వెంకటసుబ్బయ్య, నాగేంద్ర, బోయపల్లి నరసింహులు, పవన్ రాజు, సింగనమల శివ తదితర ఎన్డీఏ కార్యకర్తలు పాల్గొన్నారు.


