జూబ్లీహిల్స్ అక్టోబర్ 30 (పున్నమి ప్రతినిధి)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇవాళ యూసుఫ్గూడలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతా రామచంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పోతుగంటి భరత్ ప్రసాద్ గారు, మరియు బీజేపీ నాయకులు ప్రజలలు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి, పారదర్శక పాలనకు బీజేపీనే ఏకైక ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గారి “వికసిత తెలంగాణ – వికసిత భారత్” దృష్టికోణాన్ని సాధించాలంటే ప్రజలు శ్రీ లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించి, బీజేపీకి మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రచారానికి స్థానిక ప్రజల నుండి ఉత్సాహపూర్వక స్పందన లభించింది.


