అక్టోబర్ 29 పున్నమి ప్రతినిధి: మొంతా తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బైరాపూర్ -వెల్దండ, రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గతంలో కొట్టుకపోయిన బైరాపూర్ బ్రిడ్జి కి తాత్కాలికంగా రెండు గుణాలు వేసి మట్టితో పూడ్చారు. గూణలకు రెండు పక్కల వేసిన మట్టి వాగు ప్రవాహానికి కొట్టుకొని పోయింది . బొల్లంపల్లి గానుగట్టు తండాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది . దీంతో వాహనదారులకు మరియు ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.బైరాపూర్ గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న జగదీష్ అనే వ్యక్తి ఇంటిలోకి భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో ఇంటిలో ఉన్న నిత్యవసర వస్తువులు అన్నీ తడిసి ముద్దాయి కావున అధికారులు తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.కావున ప్రజలు ఎవరు వాగులు దాటడానికి ప్రయత్నించవద్దని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ఇబ్బంది ఉంటే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని వెల్దండ ఎస్సై కురుమూర్తి మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు రాకపోకలకు అంతరాయం.
అక్టోబర్ 29 పున్నమి ప్రతినిధి: మొంతా తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బైరాపూర్ -వెల్దండ, రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గతంలో కొట్టుకపోయిన బైరాపూర్ బ్రిడ్జి కి తాత్కాలికంగా రెండు గుణాలు వేసి మట్టితో పూడ్చారు. గూణలకు రెండు పక్కల వేసిన మట్టి వాగు ప్రవాహానికి కొట్టుకొని పోయింది . బొల్లంపల్లి గానుగట్టు తండాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది . దీంతో వాహనదారులకు మరియు ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.బైరాపూర్ గ్రామంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న జగదీష్ అనే వ్యక్తి ఇంటిలోకి భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో ఇంటిలో ఉన్న నిత్యవసర వస్తువులు అన్నీ తడిసి ముద్దాయి కావున అధికారులు తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.కావున ప్రజలు ఎవరు వాగులు దాటడానికి ప్రయత్నించవద్దని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ఇబ్బంది ఉంటే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని వెల్దండ ఎస్సై కురుమూర్తి మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

