ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు నేతృత్వంలో నందిగామ పురపాలక సంఘం లోతట్టు ప్రాంతాలలో తుఫాన్ ప్రభావం మరియు రాబోవు 5 రోజుల భారీ వర్షాల కారణంగా జలమయం, నష్టాలు మరియు ప్రమాదాలు కలగకుండా ముందస్తుగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
*పునరావాస కేంద్రాలు* :
బాబు జగజ్జీవన్ రామ్ ఫంక్షన్ హాల్ (పాత బస్టాండ్)
జిల్లా పరిషత్ హై స్కూల్
మధిర రోడ్ లో కేంద్రీయ విద్యాలయం ఈ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, జనరేటర్లు, మంచినీరు మరియు విద్యుత్ సౌకర్యాలు సమస్యలేమి లేకుండా ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే, పట్టణం లోని శిధిల భవనాలను గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతుంది.
*ఇతర చర్యలు* :
ఎండిపోయిన చెట్లను తొలగించడం
ప్రధాన డ్రెయిన్లలో జలమయం మరియు మురుగు నీరు నిలవకుండా జెసిబి ద్వారా పూడికలు తొలగించడం
సమస్యలు ఏర్పడకుండా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. ఫణి శ్రీనివాసరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కే.దుర్గాప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


