Friday, 27 March 2026
  • Home  
  • ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం రాష్ట్ర పరిశీలకులు సుదర్శన్‌రెడ్డి, హనుమంతు
- E-పేపర్

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం రాష్ట్ర పరిశీలకులు సుదర్శన్‌రెడ్డి, హనుమంతు

నంద్యాల ఉద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహనతో పనిచేస్తున్న ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమేనని రాష్ట్ర పరిశీలకులు సుదర్శన్‌రెడ్డి, హనుమంతు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యవర్గ సభ్యుడు సంఘం బలోపేతానికి కృషి చేయాలని, సభ్యత్వం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. హనుమంతు మాట్లాడుతూ సంఘం కోసం నిజాయితీగా కృషి చేసే వారిని రాష్ట్ర నాయకత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప మాట్లాడుతూ రాష్ట్రాధ్యక్షులు కె.ఆర్‌.సూర్యనారాయణ మార్గదర్శకత్వంలో ఉద్యోగుల శ్రేయస్సు కోసం సంఘం కృషి చేస్తోందని, “రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం” కార్యక్రమం ద్వారా ఉద్యోగుల సమస్యలపై సమగ్ర అవగాహన సృష్టిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, రాష్ట్ర ఎన్‌ఎంఆర్ టైమ్‌స్కేల్‌ అధ్యక్షుడు సురేష్‌, వేణుగోపాల్‌రెడ్డి, యశ్వంత్‌, విజయలక్ష్మి, చక్రధర్‌, చెంచమ్మ, యేసురత్నం, మహిళా సిటీ అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ, సంఘం ప్రతినిధులు కోటేశ్వర రావు, బుల్లెట్ భాష, చక్రపాణి గౌడ్, మహమ్మద్ రఫీ, పద్మావతి, ప్రీతి, గాయత్రి, ధరణి, నిర్మల, నాగపద్మిని, గుర్రమ్మ, శిరీష, తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల ఉద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహనతో పనిచేస్తున్న ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘమేనని రాష్ట్ర పరిశీలకులు సుదర్శన్‌రెడ్డి, హనుమంతు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యవర్గ సభ్యుడు సంఘం బలోపేతానికి కృషి చేయాలని, సభ్యత్వం పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. హనుమంతు మాట్లాడుతూ సంఘం కోసం నిజాయితీగా కృషి చేసే వారిని రాష్ట్ర నాయకత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప మాట్లాడుతూ రాష్ట్రాధ్యక్షులు కె.ఆర్‌.సూర్యనారాయణ మార్గదర్శకత్వంలో ఉద్యోగుల శ్రేయస్సు కోసం సంఘం కృషి చేస్తోందని, “రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం” కార్యక్రమం ద్వారా ఉద్యోగుల సమస్యలపై సమగ్ర అవగాహన సృష్టిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, రాష్ట్ర ఎన్‌ఎంఆర్ టైమ్‌స్కేల్‌ అధ్యక్షుడు సురేష్‌, వేణుగోపాల్‌రెడ్డి, యశ్వంత్‌, విజయలక్ష్మి, చక్రధర్‌, చెంచమ్మ, యేసురత్నం, మహిళా సిటీ అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ, సంఘం ప్రతినిధులు కోటేశ్వర రావు, బుల్లెట్ భాష, చక్రపాణి గౌడ్, మహమ్మద్ రఫీ, పద్మావతి, ప్రీతి, గాయత్రి, ధరణి, నిర్మల, నాగపద్మిని, గుర్రమ్మ, శిరీష, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.