అల్లూరి జిల్లా స్ధానిక ఫిర్యాదుల కమిటీ చైర్పర్సన్గా నియమితులైన డా. కంబిడి కృష్ణకుమారిని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అభినందించారు. అరకులోయ మండలం, యండపల్లివలస లోని కృష్ణకుమారి స్వగృహానికి వెళ్లిన కిడారి ఆమెకు శాలువాతో సత్కరించారు. ఆమె నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గిరిజనులు, మహిళలు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. గిరిజనుల సంక్షేమం కోసం డా. కంబిడి కృష్ణకుమారి చేస్తున్న సేవలకు తనవంతు ప్రోత్సాహంగా రూ.5,000 ఆర్థిక సహాయాన్ని కిడారి శ్రావణ్ కుమార్ అందజేశారు.

అరకు: స్ధానిక ఫిర్యాదుల కమిటీ చైర్ పర్సన్ ను సత్కరించిన జీసీసీ చైర్మన్
అల్లూరి జిల్లా స్ధానిక ఫిర్యాదుల కమిటీ చైర్పర్సన్గా నియమితులైన డా. కంబిడి కృష్ణకుమారిని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అభినందించారు. అరకులోయ మండలం, యండపల్లివలస లోని కృష్ణకుమారి స్వగృహానికి వెళ్లిన కిడారి ఆమెకు శాలువాతో సత్కరించారు. ఆమె నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గిరిజనులు, మహిళలు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. గిరిజనుల సంక్షేమం కోసం డా. కంబిడి కృష్ణకుమారి చేస్తున్న సేవలకు తనవంతు ప్రోత్సాహంగా రూ.5,000 ఆర్థిక సహాయాన్ని కిడారి శ్రావణ్ కుమార్ అందజేశారు.

