*బస్సు ప్రమాదం వెనుక మిస్టరీని ఛేదించిన పోలీస
నాగర్ కర్నూల్ ప్రతినిధి/ అక్టోబర్ 25 పున్నమి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని నిన్న జరిగిన టువంటి బస్సు ప్రమాదం పై సంచలన విషయం వెలుగులోకి వచ్చింది బస్సు ప్రమాదం వెనుక దాగివున్న అసలు మిస్టరీని పోలీసులు కనిపెట్టారు ఒక బైకు కారణంగా బస్సు ప్రమాదం జరిగి మంటలు వ్యాపించి దాదాపు 20 మందిని ఈ ఘటనలో అగ్నికి ఆహుతి అయ్యారు అయితే తాజాగా బైక్ పై ఉన్నటువంటి రవిశంకర్ అనే వ్యక్తి గురించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలో వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలలో రవిశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా బైకును స్పీడ్ గా నడపడం ఉంటే దృశ్యాలు కనిపించాయి అయితే అతను వెనుక ఉన్నటువంటి ఎర్రి స్వామి అనే మరో వ్యక్తిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా కీలక విషయాలు బయటకు వచ్చాయి.
రవి శంకర్ మిత్రుడు ఎర్రి స్వామి మాట్లాడుతూ… పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకొని అక్కడి నుంచి ఇద్దరు బైక్పై వెళ్తున్నాం. అలా వెళ్తున్న సందర్భంలో అనుకోకుండా బైక్ స్కిడ్ అయ్యి కుడివైపు ఉన్నటువంటి డివైడర్ను ఢీకొట్టగా ఇద్దరం ఒక్కడికక్కడే కింద పడిపోయాం అయితే ఈ సందర్భంలో రవిశంకర్ స్పాట్లోనే చనిపోయాడు నాకు చిన్న చిన్న గాయాలైన కూడా అక్కడి నుంచి భయంతో వెంటనే వెళ్లిపోయాను అని శివశంకర్ మిత్రుడు ఎర్రిస్వామి కీలక విషయాలను వెల్లడించాడు ఇక అక్కడే ఉన్నటువంటి బైకును బస్సు ఈడ్చికెళ్లడంతో ప్రమాదం జరిగిందే అని సంచలన విషయాలను తెలిపాడు దీంతో ఈ ప్రమాదంలో ఒకవైపు రవిశంకర్ ది మనవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్ ది కూడా తప్పుగా ఉందని పోలీసులు నిర్ధారించారు ఏది ఏమైనా కూడా ఈ బస్సు ప్రమాదంలో దాదాపు 20 మంది అగ్నికి ఆహుతిగా కాగా మరో కొంతమంది ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు కాగా ఈ బస్సు దగ్ధం ఘటన ఎవరిదీస వ్యాప్తంగా సంచలనం తీపిన విషయం అందరికీ తెలిసిందే


