ఖమ్మం కొత్త బస్టాండ్ ఆవరణలో వృధాగా పోతున్న నీరు
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 18
నీరు వృధాగా పోతున్న పట్టించుకోరే
నిరంతరం నీరు వృధాగానే పోతుంది
మోటర్ పైపులైను పనిముట్లు నాసిరకం వస్తువులను ఉపయోగించినట్లు అనిపిస్తుంది
అధికారుల నిర్లక్ష్యం కొట్టేసినట్టుగా కనిపిస్తుంది
ఖమ్మం జిల్లా ఖమ్మం కొత్త బస్టాండ్ ఆవరణలో వృధాగా పోతున్న నీరు .మోటర్ నుండి లీక్ అయ్యి నీరు వృధాగా పోతున్న ఏ ఒక్క అధికారి కూడా తమకు ఏం సంబంధం లేనట్టుగా పట్టించుకోకుండా అలాగే వదిలేయడం జరిగింది. మోటరు పైపు లీకేజీ నుండి నీరు కారు కుంట చిన్నపాటి ఒక కాలవ లాగా నీరు ప్రవహించి ప్రయాణికులకు నడవడానికి ఇబ్బంది గా మారింది .నిత్యం కొత్త బస్టాండ్ కు సుమారు 1000 నుండి 2000 మంది ప్రయాణికులు దూరప్రాంతాల నుండి ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు వృధాగా పోతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అధికారులు బస్టాండ్ పరిసరాలలో పర్యవేక్షిస్తున్నారా లేదా వారి కేటాయించిన రూములలో కూర్చొని కాలక్షేపం చేస్తున్నారా అని అధికారులపై ప్రయాణికులు మండి పడుతున్నారు మరి ఇలాంటి అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ కూడా కరువైంది ప్రయాణికులు అట్టి లీకేజీ మరిమత్తులను వెంటనే చేపించాలని కోరుకుంటున్నారు వీరిపైన చర్యలు తీసుకునే జిల్లా అధికారులు ఉన్నారా లేరా అని ఎదురు చూడాలి మరి


