ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం నగరము లోని గట్టయ్య సెంటర్ మహా రాష్ట్ర బ్యాంకు దగ్గర చిన్నదో పెద్దదో రోడ్డు ప్రమాదం జరుగు తూనే ఉంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజి, కవిత పీజీ కాలేజ్ విద్యార్థిని, విద్యార్థులతో పాటు ప్రజలు కూడా నిత్యం ప్రయాణలు కొనసాగిస్తుంటారు. అయితే ఇక్కడ మహా రాష్ట్ర బ్యాంక్ మూల మలుపు లో అటు ఇటు వచ్చే వాహనాలు వేగంగా రావడం తో పాటు గా బ్యాంకు కి వచ్చే వారి యొక్క వావహనాలు రోడ్డ మీదనే నిలపడం కూడా ప్రమాదలకి కారణం అయితున్నాయి. కార్పొరేషన్ అధికారులు తు తు మంత్రం గా చెప్పట్టిన అక్రమణల తొలగింపు ఎం మాత్రము కూడా ఫలితాలు ఇవ్వలేదు. మల్లి యధావిధిగా దుకాణదారులు రోడ్డు మీదకు వచ్చి వారి యొక్క కార్యకలాపాలు కొనసాగి స్తున్నారు. కార్పొరేషన్, పోలీస్ అధికారులు సమనవ్యం తో ప్రణాళిక రూపొందించి ఈ ప్రమాదలకి అడ్డుకట్ట వెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.


