ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి
వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
🔹 వరద నీరు నిలిచిన ప్రాంతాలకు వెళ్లవద్దు.
🔹 కరెంటు స్థంభాలు, తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండండి.
🔹 బలమైన ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది.
🔹 మ్యాన్హోల్స్, డ్రైనేజీ కాలువలపై నడిచే ముందు అప్రమత్తంగా ఉండండి.
🔹 అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు.
🔹 పిల్లలు, వృద్ధులను ప్రత్యేక శ్రద్ధతో చూసుకోవాలి.
🔹 చెట్లు, హోర్డింగ్స్, ప్రకటన పలకల కింద నిలబడవద్దు.
🔹 విద్యుత్ పరికరాలు, తడి చేతులతో స్విచ్లు లేదా వైర్లను తాకవద్దు.
🔹 ప్రభుత్వం, అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించండి.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు కాల్ చేయండి.
ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేము. అయితే ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తతతో ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు.
“మీ భద్రతే మా బాధ్యత – ప్రజల కోసం నిరంతరం పనిచేసే అధికారులు
భద్రంగా ఉండండి… అప్రమత్తంగా ఉండండి… మీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోండి.



