ఖమ్మం (పున్నమి ప్రత్యేక ప్రతి నిధి )
ఒక కుటుంబము లో మొదలైన అన్నదమ్ముల ఆస్థి పంపకాలు విషయం పెద్ద దుమరంగా మారింది. శనివారం సాయంత్రం నుండి ప్రారంభం అయినా గొడవ అర్ధ రాత్రి వరకు సాగింది.
డివిజన్ కార్పొరేటర్ మిక్కిలి నేని మంజుల భర్త నరేంద్ర మీద దాడి వరకు వెళ్ళింది.
వివారాల్లోకి వెళ్తే ఖమ్మం నగరం లోని
VDO’S కాలనీ కి చెందిన చెరుకూరి శ్రీధర్, శేఖర్ అన్నదమ్ములు. వీరి మధ్య గత నలబై రోజులు గా ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. అయితే తమ్ముడు శేఖర్ అన్న శ్రీధర్ లేని సమయం లో ఇంటిని ఆక్రమించుకొని రౌడీ లు, పోలీస్ ల సపోర్ట్ తో ఆ ఇంట్లో ఉంటున్నారు. ఇదే క్రమం లో వీరి తల్లి అయినా చెరుకూరి సుజాత మిక్కిలి నేని నరేంద్ర కి ఫోన్ చేయాగ అయన కుటుంబ విషయం కూర్చొని మాట్లాడుకోండి అని సమాధానం ఇవ్వడం జరిగింది. శేఖర్ బామర్ది గంగాధర్ మిక్కిలి నేని నరేంద్ర దగ్గర వెళ్లి మంత్రులు, పోలీసుల సపోర్ట్ మాకు ఉంది నీకు ఎంత కావాలో చెప్పు అని అడగగా అయన తిరష్కరించారు. శనివారం సాయంత్రం మిక్కిలి నేని నరేంద్ర ఆయన స్నేహితులు కారు లో డివిజన్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆక్రమించు కున్న ఇంట్లో నుండి రౌడీ లు పెద్ద ఎత్తున వచ్చి నరేంద్ర మీద దాడి చెయ్యడం జరిగింది. అయన మీద దాడి విషయం తెలుసుకున్న నరేంద్ర అభిమానులు. కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రీధర్, శేఖర్ ఇంటిని ముట్టడి చేసి అద్దాలు పగలకొట్టారు. ఈ సందర్భము గా కార్పొరేటర్ అయినా నరేంద్ర శ్రీమతి అయినా శ్రీమతి మిక్కిలి నేని మంజుల మీడియా ప్రతి నిధులు తో మాట్లాడు తు జరిగింది అంత వివరించడం జరిగింది. 40రోజులు గా స్థానిక రెండవ పట్టణ పోలీస్ లకి పిర్యాదు చేసిన పట్టించు కోలేదని ఆమె ఆరోపించారు. రౌడీ లు ఇంటి ముందే తాగి అల్లరి చేస్తుంటే పోలీస్ లకి అనేక సార్లు చెప్పడం జరిగింది అని పోలీస్ లు రౌడీ లకి,కబ్జా కోరులకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు ఆమె భర్త మీద దాడి చేసిన వారిని చట్టపరం గా శిక్షించాలాని VDO s కాలనీ లో వివాద స్పదం అయినా ఆ ఇంటిని సీజ్ చేయాలి అని కార్పొరేటర్ శ్రీమతి మిక్కిలి నేని నరేంద్ర మంజుల డిమాండ్ చేశారు.


