ఖమ్మం జిల్లా…
మంత్రి తుమ్మల ఆదేశాల అనుసారం ఖమ్మం నగరంలో ఓటు చోరీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ యువ నాయకుడు తుమ్మల యుగేందర్.
*తుమ్మల యుగంధర్ కామెంట్స్…*
దేశంలో పెద్దఎత్తున ఓట్ల చోరీకి పాల్పడి కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చింది.
ఎన్నికల కమిషన్ బిజెపి కు అనుబంధ సంఘంలా పని చేస్తోంది.
రాహుల్గాంధీ ఓటు చోరీ జరిగిన తీరును వివరిస్తూ అన్ని రకాల ఆధారాలను చూపించినా కూడా ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదు.
బిజెపి పార్టీ తనకు అనుకూలంగా వేల సంఖ్యల్లో లేని ఓటర్లను ఉన్నట్టుగా చూపించి ఓటు చోరీకి పాల్పడింది.
బిజెపి పార్టీకి అనుకూలంగా లేని ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లడం కొరకు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాము.
ప్రతి డివిజన్లో పెద్ద సంఖ్యలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతాము.

