నంద్యాల టౌన్ గాంధీ చౌక్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు & సుందర్ నేతృత్వం వహించారు. వీరిద్దరూ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, గాంధీజీ స్ఫూర్తి దేశానికే మార్గదర్శకమని అన్నారు. ఈ సందర్బంగా రాచమడుగు చందు మాట్లాడుతూ గాంధీజీ చూపించిన సత్యం, అహింస మార్గాలు ఈ రోజుకి మరింత అవసరం. ఆయన స్ఫూర్తి మాకు ప్రేరణ” అని పేర్కొన్నారు.అలాగే సుందర్ మాట్లాడుతూ గాంధీ జయంతి కేవలం జ్ఞాపకార్థం కాదు, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టుకోవాల్సిన రోజు” అని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచమడుగు రాంబాబు, శివశేఖర్, వెంకటరమణ, ఫయాజ్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

గాంధీ జయంతి సందర్భంగా జనసేన ఘన నివాళులు
నంద్యాల టౌన్ గాంధీ చౌక్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు & సుందర్ నేతృత్వం వహించారు. వీరిద్దరూ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, గాంధీజీ స్ఫూర్తి దేశానికే మార్గదర్శకమని అన్నారు. ఈ సందర్బంగా రాచమడుగు చందు మాట్లాడుతూ గాంధీజీ చూపించిన సత్యం, అహింస మార్గాలు ఈ రోజుకి మరింత అవసరం. ఆయన స్ఫూర్తి మాకు ప్రేరణ” అని పేర్కొన్నారు.అలాగే సుందర్ మాట్లాడుతూ గాంధీ జయంతి కేవలం జ్ఞాపకార్థం కాదు, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టుకోవాల్సిన రోజు” అని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచమడుగు రాంబాబు, శివశేఖర్, వెంకటరమణ, ఫయాజ్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

