రోడ్లు, బ్రిడ్జీల కోసం వందలాది మంది ఆందోళన

వీ. మాడుగుల మండలం శంకరం పంచాయతీకి చెందిన తాడివలస, గోప్పూరు, రాయిపాలెం, రాజంపేట, వెలగలపాడు, కోత్తవలస, మామిడిపాలెం గ్రామాల వందలాది గిరిజనులు శుక్రవారం తాడివలస గెడ్డలో జలదీక్ష చేపట్టారు.
వర్షాకాలంలో రోడ్ల లేమితో గర్భిణీలు, చిన్న పిల్లలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం హామీలు నెరవరలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
వందలాది మంది మహిళలు, పురుషులు “గెడ్డలపై బ్రిడ్జులు, రోడ్ల సౌకర్యం కల్పించాలి” అంటూ నినాదాలు చేశారు.
సర్పంచ్ వై. రమేష్, స్థానిక నేతలు కార్యక్రమంలో పాల్గొని గిరిజనుల ఆందోళనను స్వీకరించారు.

