భీమవరం : బాడీ బిల్డింగ్ అంటే కండల ప్రదర్శన కాదని, ఫిట్నెస్ ప్రక్రియ అని, చురుగ్గా ఉంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం కృష్ణదేవరాయ కళ్యాణ మండలంలో ఆదివారం మిస్టర్ ఆంధ్ర ఓపెన్ స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీలను విజేతలకు ట్రోఫీ తోపాటు మూడు మోటార్ సైకిల్స్, టీవీ లను అందించడం గొప్ప విశేషమని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులఖండం కోటేశ్వరరావు, వబిలిశెట్టి రామకృష్ణ, సతివాడ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం : బాడీ బిల్డింగ్ అంటే కండల ప్రదర్శన కాదని, ఫిట్నెస్ ప్రక్రియ అని, చురుగ్గా ఉంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం కృష్ణదేవరాయ కళ్యాణ మండలంలో ఆదివారం మిస్టర్ ఆంధ్ర ఓపెన్ స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీలను విజేతలకు ట్రోఫీ తోపాటు మూడు మోటార్ సైకిల్స్, టీవీ లను అందించడం గొప్ప విశేషమని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులఖండం కోటేశ్వరరావు, వబిలిశెట్టి రామకృష్ణ, సతివాడ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

