భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కె. రఘునాథ్ (రసాయన శాస్త్రం సహాయ ఆచార్యులు), ఎం. శంకర్ (ఆంగ్ల సహాయ ఆచార్యులు) గారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా కళాశాలలో ఘనంగా అభినందన సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కరోల్ల బుచ్చయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, “విద్యార్థుల బాగు కోసం నిరంతరం కృషి చేస్తున్న ఈ ఉపాధ్యాయులు సర్వదా అభినందనీయులు. వీరి నిబద్ధత, కృషి ఇతర అధ్యాపకులకు ఆదర్శనీయమై నిలుస్తుంది” అని అభినందించారు.
అధ్యాపకులు మరియు విద్యార్థులు కూడా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి సేవలను కొనియాడారు.

