రక్త దానం చేసే ప్రతీ వ్యక్తి ప్రాణదాతలే
గురజాడ విద్యా సంస్థల అధినేత జి.వి.స్వామి నాయుడు(శ్రీకాకుళం – )



‘రక్త దానం చేసే ప్రతీ వ్యక్తి ప్రాణదాతలేన’ని గురజాడ విద్యా సంస్థల అధినేత జి.వి.స్వామి నాయుడు అన్నారు. గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ కళాశాలలో జాతీయ సేవా పధకం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరo నిర్వహించారు. శిభిరంను ప్రారంభించి మాట్లాడుతూ రక్తదానంపై అవగాహన కార్యక్రమాలను ప్రతీ కళాశాలలో నిర్వహించాలని, అవకాశం ఉన్న ప్రతీ విద్యార్థి తప్పనిసరిగా రక్త దానం చేయాలనీ అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.వి. సత్యన్నారాయణ మాట్లాడుతూ ప్రతీ ఏడాది ఇటువంటి శిభిరాలను కళాశాలలో నిర్వహిస్తున్నామని, యాజమాన్య సహితం ఇందుకు అన్నీ విధాలుగా సహకరిస్తున్నదన్నారు. రిమ్స్, లయన్, రెడ్ క్రాస్ సంస్థలు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విదంగా సహకరించరని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో రిమ్స్ మెడికల్ ఆఫీసర్ డా.శ్యామల, తాతారావు, లయన్ సునీల్, చరణ్, రెడ్ క్రాస్ సత్యన్నారాయణ, చైతన్య,కళాశాల జాతీయ సేవా పథకం పి.ఓలు అప్పల నాయుడు, గోపాలరావు, మేజర్ వంగ మహేష్ ‘చేయి చేయి కలుపు’ సoస్థ వినోద్, టెక్కలి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపాల్ నoదేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

