*
కాట్రేనికోన: సుదీర్ఘ కాలంగా పురోహిత వృత్తిలో ఉంటూ పురహితవు కోరే పురోహితులను అమలాపురం ఆపస్థంభ పురోహిత పరిషత్ భాద్రపద పౌర్ణమి ఆదివారం ఘనంగా సన్మానించి సత్కరించారు.
ఇందులో భాగంగా కాట్రేనికోన మండలం నుండి నడవపల్లి గ్రామానికి చెందిన పురోహితులు బ్రహ్మశ్రీ వేదుల ఆంజనేయ మూర్తి (హనుమాన్)
ఎంపిక చేసి ఘనంగా సన్మానించి సత్కరించారు. వీరి తాత వేదుల ఆంజనేయులు వద్ద చిన్నప్పుడే స్మార్త విద్య పెదనాన్న సత్యనారాయణమూర్తి ద్వారా జ్యోతిషం వాస్తు శాస్త్ర ప్రావీణ్యం తండ్రి సీతారామచంద్ర మూర్తి నుండి వ్యాకరణం సాహిత్యం నేర్చుకుని వంశపారంపర్యంగా ఉన్న పౌరోహిత్యం లో వివాహాలు దేవతా ప్రతిష్ఠలు హోమాలు వైదిక వృత్తిలో ఎన్నెన్నో కార్యక్రమాలు
స్థానిక పెద్దల సహకారం పురోహితులు గా విధులు నిర్వహిస్తున్నారు. వీరి సేవలను గుర్తించి ముఖ్య అతిథిగా విచ్చేసిన
శ్రీ విద్యా పీఠ అధ్యక్షులు, ఆగమాభిజ్ఞ, ధనంజయ,(విమలానందనాధ) గురువర్యులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్రహ్మణ్య శర్మ (చిన్న) వారి చేతులమీదుగా ఘనంగా సన్మానించి సత్కరించడం పట్ల కాట్రేనికోన మండల బ్రాహ్మణ సేవా సంఘం హర్షం వ్యక్తంచేశారు. అలాగే కాళ్ళకూరి కామేశ్వర శర్మ తమ
గురువుగకి ఈవిధంగా సత్కరించడం పట్ల సంతోషం తో కుండలేశ్వస్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో ఉన్నత అభివృద్ధి చెందాలని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ శుభాకాంక్షలు తెలియపరిచారు


