పనితీరు మార్చుకోవాలని వైద్య సిబ్బందిని హెచ్చరించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
దుత్తలూరు పున్నమి న్యూస్ : సెప్టెంబర్ 2 :////
దుత్తలూరు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తూ ఆసుపత్రిని తనిఖీ చేశారు. పరిసరాలను, గదులను పరిశీలించారు. పరిశుభ్రత లేనందున సిబ్బందిని హెచ్చరించారు. పనితీరు మార్చుకోవాలని లేదంటే పలాయనం చెందాల్సి వస్తుందన్నారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరికరాలు సరిగా ఉన్నాయా లేదా అని అడిగారు. ఆసుపత్రిలో బీపీని చెకప్ చేయించుకున్నారు. సిబ్బంది తీరు మెరుగుపరచుకోవాలన్నారు. అనారోగ్యంతో వచ్చే వారిని గౌరవప్రదంగా గౌరవించి వారికి మంచి వైద్యం అందించి తగిన మందులు ఇచ్చి పంపించాలన్నారు. ప్రజా ఆరోగ్యం కోసం పనిచేయాలని తెలియజేశారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పమన్నారు.
ఈ కార్యక్రమంలో దుత్తలూరు మండల నాయకులు, వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

