నరేంద్రపురం గురుకుల పాఠశాల ప్రహరీ గోడ ఎత్తు పెంచాలి. కోరుకొండ జాన్
పి గన్నవరం నుండి (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 15.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం లో ఉన్న గురుకుల పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టినప్పుడు తగినంత ఎత్తు లేకపోవడం వలన విద్యార్థులు సులభంగా గోడ దూకి పారిపోతున్నారు. గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులంతా పేద పిల్లలు. సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి చదివించుకుంటున్నాము ఒకవేళ రాత్రి సమయంలో పారిపోతే మా పిల్లలు బాధ్యత ఎవరని. అసలే ఈ పాఠశాల ఆవరణము చుట్టూ పాములో పుట్టలు అధికంగా ఉంటాయని తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు తక్షణమే ప్రభుత్వము యుద్ధ ప్రతిపాదికన నరేంద్రపురం గురుకుల పాఠశాల ప్రహరి గోడ ఎత్తును పెంచి ఫినిషింగ్ ముళ్ళ కంచె వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.అలాగే అనేకసార్లు రాత్రి సమయంలో విద్యార్థులు గోడ దూకి పారిపోతున్నారని ప్రిన్సిపాల్. సెక్యూరిటీ గార్డులు తెలియజేశాస్తున్నారు.


