ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి
ప్రభుత్వ ఉద్యోగం సాధించడమనేది నేటి యువతకు ఒక కల. అయితే ఒకే ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెల్లు.. లేదా ఇద్దరు అన్నదమ్ములు లేదా అక్కాతమ్ముడు.. భార్యాభర్తలు.. ఇలా ఓ కుటుంబంలో ఏకంగా ముగ్గురు.. కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన సంఘటనలు చూశాం. కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఎంపిక కావడం మాత్రం చాలా తక్కువ గానే చూసుంటాం. ఈ అసాధారణ విషయాన్ని చేసి చూపించారు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా వాసులు.
ఒకే కుటుంబంలో ముగ్గురు, నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం అరుదుగా జరిగే అద్భుతం. ఈ అసాధారణ విజయాన్ని సాధించి, పేదరికాన్ని చదువుతో జయించవచ్చని నిరూపించింది గౌరమ్మ కుటుంబం. వేపమాకులపల్లికి చెందిన గౌరమ్మకు నలుగురు కూతుళ్లు. పదేళ్ల క్రితం భర్త మరణించిన తర్వాత కుటుంబ బాధ్యత మొత్తం ఆమె భుజాలపై పడింది.
అయినా మొక్కవోని దీక్షతో గౌరమ్మ కూలీ పనులు చేస్తూ, తన పిల్లలను చదువులో ముందుకు నడిపించారు. పేదరికం, సామాజిక సమస్యలు ఎదురైనా కానీ వారు చదువుపై అంకితభావంతో భవిష్యత్తును కాపాడుకున్నారు. గౌరమ్మ నలుగురు కూతుళ్లు కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి తల్లి కలను నిజం చేశారు.

ఒకే ఇంట్లో నలుగురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు..!
ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమనేది నేటి యువతకు ఒక కల. అయితే ఒకే ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెల్లు.. లేదా ఇద్దరు అన్నదమ్ములు లేదా అక్కాతమ్ముడు.. భార్యాభర్తలు.. ఇలా ఓ కుటుంబంలో ఏకంగా ముగ్గురు.. కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన సంఘటనలు చూశాం. కానీ ఒకే కుటుంబంలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఎంపిక కావడం మాత్రం చాలా తక్కువ గానే చూసుంటాం. ఈ అసాధారణ విషయాన్ని చేసి చూపించారు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా వాసులు. ఒకే కుటుంబంలో ముగ్గురు, నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం అరుదుగా జరిగే అద్భుతం. ఈ అసాధారణ విజయాన్ని సాధించి, పేదరికాన్ని చదువుతో జయించవచ్చని నిరూపించింది గౌరమ్మ కుటుంబం. వేపమాకులపల్లికి చెందిన గౌరమ్మకు నలుగురు కూతుళ్లు. పదేళ్ల క్రితం భర్త మరణించిన తర్వాత కుటుంబ బాధ్యత మొత్తం ఆమె భుజాలపై పడింది. అయినా మొక్కవోని దీక్షతో గౌరమ్మ కూలీ పనులు చేస్తూ, తన పిల్లలను చదువులో ముందుకు నడిపించారు. పేదరికం, సామాజిక సమస్యలు ఎదురైనా కానీ వారు చదువుపై అంకితభావంతో భవిష్యత్తును కాపాడుకున్నారు. గౌరమ్మ నలుగురు కూతుళ్లు కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి తల్లి కలను నిజం చేశారు.

