చిట్వేల్, ఆగస్టు — పున్నమి ప్రతినిధి
పేదలు ఆపదలో ఉన్న వేళ ‘నేనున్నాను’ అని అండగా నిలవడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి మనసుకు నిదర్శనమని టిడిపి నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి అన్నారు.
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన స్వయంగా ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
“పేదల కష్టసమయంలో పక్కన నిలబడటం మా ధర్మం. రాష్ట్ర ప్రజల కోసం సీఎం గారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు” అని ముక్కా సాయి వికాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కూటమి ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


