Tuesday, 9 December 2025
  • Home  
  • గుండవిల్లిపేట పాఠశాలలో మధ్యాహ్న భోజన పరిశీలన
- ఆంధ్రప్రదేశ్

గుండవిల్లిపేట పాఠశాలలో మధ్యాహ్న భోజన పరిశీలన

నరసన్నపేట మండలం, జూలై 29:మండలంలోని గుండివిల్లిపేట ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఎంఈఓ ఉప్పాడ శాంతారావు గారు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.అలాగే, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆహార నాణ్యతను సుదీర్ఘంగా పరిశీలించిన ఆయన, పిల్లలకు పోషకాహారంతో కూడిన, శుభ్రతతో కూడిన భోజనాన్ని అందించాలని పాఠశాల నిర్వాహకులకు సూచనలు చేశారు.

నరసన్నపేట మండలం, జూలై 29:మండలంలోని గుండివిల్లిపేట ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఎంఈఓ ఉప్పాడ శాంతారావు గారు ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.అలాగే, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆహార నాణ్యతను సుదీర్ఘంగా పరిశీలించిన ఆయన, పిల్లలకు పోషకాహారంతో కూడిన, శుభ్రతతో కూడిన భోజనాన్ని అందించాలని పాఠశాల నిర్వాహకులకు సూచనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.