ఓబులవారిపల్లి జూలై 22 (పున్నమి ప్రతినిధి)
శ్రీ యల్లమ్మ తల్లి జాతర సందర్భంగా ఓబులవారిపల్లి మండలంలోని మంగళంపల్లి గ్రామ ప్రజలు మరియు సర్పంచ్ ఆహ్వానం మేరకు తిరుణాల కార్యక్రమానికి *రైల్వే కోడూరు
నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్
హాజరై భక్తులు మరియు గ్రామ ప్రజలతో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు వీరికి ఘన స్వాగతం పలికి తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో నాయుకులు, యువకులు, గ్రామ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు.ముక్కా రూపానంద రెడ్డి
మాట్లాడుతూ*
“ఈ గ్రామానికి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. మీ అభివృద్ధికి నేను ఎప్పుడూ అంకితభావంతో పనిచేస్తాను. ఇటువంటి తిరణాల కార్యక్రమాలు మన పల్లె సాంస్కృతిని చాటి చెబుతాయి”అని అన్నారు.ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ”జాతరల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు నిలుపుకోవచ్చు. మంగళంపల్లి ప్రజల ఆదరణ నాకు ఎంతో ఆనందం కలిగించింది. మీ ఆశీస్సులతో మరిన్ని అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తాను.” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు, కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


