తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, ఆకాంక్షల సాధన కోసం నిర్వహిస్తున్న 9వ తెలంగాణ ఉద్యమకారుల వార్షికోత్సవ సభకు మంథని నియోజకవర్గం నుంచి ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 27న యాదాద్రిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జిట్టా బాలకృష్ణా రెడ్డి ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యమకారుల సమస్యలు, ఆకాంక్షలపై చర్చించి, వాటి సాధనకు కార్యాచరణ రూపొందించేందుకు సభ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన ఆధారాలు, ఉద్యమ డాటాను ప్రతి ఒక్కరూ సభకు తీసుకురావాలని సూచించారు. మంథని నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంథని విజయకుమార్, మంథని మండల అధ్యక్షుడు కాసిపేట సాంబయ్య, ప్రధాన కార్యదర్శి జాడి జంపయ్య, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మంథని సాయికుమార్, సీనియర్ తెలంగాణ ఉద్యమకారుడు దాసరి శంకరయ్య పాల్గొన్నారు.


