యాదాద్రి భువనగిరి జిల్లా
భువనగిరి పట్టణంలోని 28 వార్డులో పాత భారత్ టాకీస్ ఎదురుగా గల 963 సర్వే నెంబరు భూమిలో అక్రమ కట్టడాలు, భూ ఆక్రమణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, చట్ట విరుద్దంగా కట్టిన ఇండ్లకు ఇంటి నెంబర్లు కేటాయించొద్దని చైర్మన్ మరియు కమిషనర్లకు 28 వార్డు కౌన్సిలర్ సూదగాని సరిత రాజు గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ భూమిని చట్ట విరుద్ధంగా ప్లాట్లు గా విభజించి అమ్మారని, రాత్రికి రాత్రే అక్రమంగా ఇళ్ళు నిర్మించారని, కబ్జాదారులపై చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టేదిలేదని కౌన్సిలర్ తెలిపారు. ఫిర్యాదు చేసినవారిలో యువ టీం కన్వీనర్ సూదగాని రాజు, కాంగ్రెస్ నాయకుడు పోత్నక్ సన్నీ ఉన్నారు.

28 వార్డులోని 963 సర్వే నెంబరు భూమిలో అక్రమణలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చైర్మన్, కమిషనర్ లకు ఫిర్యాదు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని 28 వార్డులో పాత భారత్ టాకీస్ ఎదురుగా గల 963 సర్వే నెంబరు భూమిలో అక్రమ కట్టడాలు, భూ ఆక్రమణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, చట్ట విరుద్దంగా కట్టిన ఇండ్లకు ఇంటి నెంబర్లు కేటాయించొద్దని చైర్మన్ మరియు కమిషనర్లకు 28 వార్డు కౌన్సిలర్ సూదగాని సరిత రాజు గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ భూమిని చట్ట విరుద్ధంగా ప్లాట్లు గా విభజించి అమ్మారని, రాత్రికి రాత్రే అక్రమంగా ఇళ్ళు నిర్మించారని, కబ్జాదారులపై చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టేదిలేదని కౌన్సిలర్ తెలిపారు. ఫిర్యాదు చేసినవారిలో యువ టీం కన్వీనర్ సూదగాని రాజు, కాంగ్రెస్ నాయకుడు పోత్నక్ సన్నీ ఉన్నారు.

