పిల్లల సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో లోక్సభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు జాబితాలోకి వచ్చింది. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా ప్రతిపాదించిన Safeguarding Healthy Internet Environments for Little Digital-Natives (SHIELD) Bill, 2025 పిల్లల ఆన్లైన్ భద్రతకు సంబంధించిన నిబంధనలను సూచిస్తోంది. 13 లేదా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలా అనే అంశంపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఈ బిల్లు శుక్రవారం లోక్సభ జాబితాలోకి వచ్చినప్పటికీ సభ ముందుగానే వాయిదా పడటంతో ప్రవేశపెట్టలేకపోయారు. ప్రభుత్వం, సోషల్ మీడియా సంస్థల మధ్య కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది.

13 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణకు బిల్లు
పిల్లల సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో లోక్సభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు జాబితాలోకి వచ్చింది. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా ప్రతిపాదించిన Safeguarding Healthy Internet Environments for Little Digital-Natives (SHIELD) Bill, 2025 పిల్లల ఆన్లైన్ భద్రతకు సంబంధించిన నిబంధనలను సూచిస్తోంది. 13 లేదా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలా అనే అంశంపై ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఈ బిల్లు శుక్రవారం లోక్సభ జాబితాలోకి వచ్చినప్పటికీ సభ ముందుగానే వాయిదా పడటంతో ప్రవేశపెట్టలేకపోయారు. ప్రభుత్వం, సోషల్ మీడియా సంస్థల మధ్య కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది.

