⛔సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
⛔డీఎస్సీ అక్రమాలపై లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్
పున్నమి న్యూస్ రిపోర్టర్ మద్దాలి వెంకయ్య దొరవారిసత్రం
10-08-26
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ లీకు అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని సూళ్లూరుపేట
మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వైఎస్ఆర్సిపి శ్రేణులు నాయకులు భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
డీఎస్సీ నోటిఫికేషన్ లో కొత్త జీవోలను విడుదల చేసి వెంటనే ఆ జీవోలను రద్దు చేశారని,
యువ గళం పాదయాత్రలో నారా లోకేష్ తో అడుగులు వేసిన వాళ్లకు డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ స్కామ్ జరిగిందని తెలిపారు. ఈ డీఎస్సీలో అవకతవకులపై లోకేష్ రాజీనామా చేయకపోతే ఈ ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతాయని తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పథకం సూపర్ హిట్ అయిందని కల్లబొల్లి మాటలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.


