శ్రీకాళహస్తి, ఏప్రిల్ 21 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్పేట మున్సిపల్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మంగళవారం అక్షర చైతన్యంతో ముందుకు సాగారు. ‘సంకల్పం – విద్యా ప్రగతి’ కార్యక్రమం భాగంగా పాఠశాల పరిధిలోని పలు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు “ప్రతి ఒక్కరూ బడిబాట పట్టాలి”, “విద్యే మన భవిష్యత్తు” వంటి నినాదాలతో ప్రజల్లో విద్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. శ్రీనివాసులు మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు SMC చైర్మన్ జి. శ్రీనివాసులు, కో-ఆప్టెడ్ సభ్యుడు బాలు ఢిల్లీ బాబు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

విద్యే భవిష్యత్తు… బడిబాట పట్టాలని సందేశం– విద్యార్థుల చైతన్య యాత్ర
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 21 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్పేట మున్సిపల్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మంగళవారం అక్షర చైతన్యంతో ముందుకు సాగారు. ‘సంకల్పం – విద్యా ప్రగతి’ కార్యక్రమం భాగంగా పాఠశాల పరిధిలోని పలు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు “ప్రతి ఒక్కరూ బడిబాట పట్టాలి”, “విద్యే మన భవిష్యత్తు” వంటి నినాదాలతో ప్రజల్లో విద్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. శ్రీనివాసులు మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు SMC చైర్మన్ జి. శ్రీనివాసులు, కో-ఆప్టెడ్ సభ్యుడు బాలు ఢిల్లీ బాబు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

