👉*వరంగల్ లోని శివనగర్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు, ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కొయ్యడ ప్రభాకర్ (కరాటే ప్రభాకర్)గారు జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి వందనాలు తెలిపారు.అలాగే జిల్లా నాయకులు గోళ్ళ రాజేంద్రప్రసాద్, గడ్డం రాకేష్,మేరుగు శివకోటి యాదవ్ గారు లు జాతీయ నాయకుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశపు స్వేచ్ఛ,స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తితో జనసేన పార్టీ, అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవయే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని తెలిపారు.అలాగే అక్కడికి విచ్చేసిన ప్రజలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.*
👉*అలాగే ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లూరి అనుదీప్,ఎలబోయిన డేవిడ్,అన్సర్,మిలాన్, వీరమహిళ నాయకురాలు పబ్బు సునీత గౌడ్, ఆకులపల్లి లహరి,రామోజు రమ, అజ్మీర రాజేందర్,K. శివ,B.అనిల్, B సుమన్, N.రవీందర్, S.సతీష్,G.సుమన్, S.గోపి, A. శ్రీనివాస్,T. పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు*



