పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా స్వయం సహాయక సంఘాలకు సాయం సహకార సమృద్ధి ఋణాల మంజూరులో లోన్ చార్జీల పేరుతో అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి వసూళ్లపై స్పష్టత ఇవ్వడంతో పాటు వాస్తవాలను పరిశీలించాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు



