పున్నమి ప్రతినిధి ,తిరుపతి, విద్య జూలై 21
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ద్వితీయ సంవత్సరం విద్యార్థిని దండోజి రేవతి లాసెట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 81వ ర్యాంకు సాధించింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. తిరుమల నారాయణమ్మ రేవతిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యార్థిని మంచి ర్యాంకు సాధించేందుకు కృషి చేసిన కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డా. ఎస్. జయశ్రీ, అధ్యాపకులు డా. కె. శ్రీలక్ష్మి, డా. పి.ఆర్. భారతి, డా. జి. బాలకృష్ణప్రియ తదితరులను ప్రిన్సిపల్ అభినందించారు.
ఈ అభినందన కార్యక్రమంలో డా. జి. భద్రమణి, డా. ఎ. విద్యుల్లత తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

