బిజినేపల్లి రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని నాగర్కర్నూల్ డిటిఓ ఇమ్రాన్ అహ్మద్ తెలిపారు. బిజినేపల్లి అంబేడ్కర్ చౌరస్తాలో పోలీస్, షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. షీ టీమ్ సభ్యులు విజయలక్ష్మి, వెంకటయ్య, లీగల్ అడ్వైజర్ గాయత్రి మహిళలకు రక్షణగా ఉన్న చట్టాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాసులు, మానవ హక్కుల సంస్థ నాయకులు సాల్వాచారి, ఆంజనేయులు, తెలంగాణ సాంస్కృతిక సంఘం నాయకుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:





