ఖమ్మం, జులై
(పున్నమి న్యూస్)
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 11:30 గంటలకు ఖమ్మం చేరుకుని ఎన్ఎస్పీ నూతన శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు వెలుగు మాట్లలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:20 గంటలకు గొల్లగూడెంలోని నామ వరమ్మ స్మృతి వనంలో నివాళులు అర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్కు రోడ్డు మార్గంలో బయలుదేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

