Sunday, 12 July 2026
  • Home  
  • యాచారం మండలంలోని మల్కీజ్ గూడ గ్రామ కాంగ్రెస్ కమిటీ నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే రంగారెడ్డి
- News

యాచారం మండలంలోని మల్కీజ్ గూడ గ్రామ కాంగ్రెస్ కమిటీ నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే రంగారెడ్డి

మల్కీజ్‌గూడ గ్రామ కాంగ్రెస్ కమిటీకి నూతన నాయకత్వం – నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం – సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని ఎమ్మెల్యే పిలుపు యాచారం, జూలై 12 (ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మల్కీజ్‌గూడ గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన బాధ్యుల నియామక కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోటె శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన బాధ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వరికుప్పల యాదయ్యను గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, వరికుప్పల అజయ్ను కార్యనిర్వహణ అధ్యక్షుడిగా, చీర శ్రీశైలంను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తూ ఎమ్మెల్యే స్వయంగా నియామక పత్రాలు అందించి అభినందించారు. నూతన బాధ్యులు పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు అర్హులందరికీ చేరేలా నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు అందజేయడానికి చర్యలు చేపడుతోందని తెలిపారు. అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పథకాలపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి లబ్ధిదారునికి సమాచారం చేరేలా పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తుందని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నియామక పత్రాలు అందుకున్న గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన బాధ్యులు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విశ్వాసానికి తగిన విధంగా పనిచేస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, డీసీసీ ఉపాధ్యక్షుడు ముత్యాల వెంకటరెడ్డి, బీఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిల్లకంటి శేఖర్ రెడ్డి, సర్పంచులు దేంది రాంరెడ్డి, కేషమోని రాజు, ప్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ లిక్కి శ్రీనివాస్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోలమోని రామకృష్ణ యాదవ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం జయప్రకాష్, గ్రామ నాయకులు గౌరారం వెంకట్ రెడ్డి, చీర శేఖర్, ఉప సర్పంచ్ శిరీష వెంకటేష్ యాదవ్, వార్డు సభ్యులు చీర పద్మ మహేష్, మలిగ విక్రమ్, కొండల్, మాజీ అధ్యక్షులు కొత్తపల్లి జంగారెడ్డి, మధు, జీవన్, యాదయ్య, వెంకటేష్, శ్రీరాములు, సుధాకర్, మాజీ వార్డు సభ్యులు సాయిబాబా, త వెంకటేష్, యాదగిరి రెడ్డి, పంతులు నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మల్కీజ్‌గూడ గ్రామ కాంగ్రెస్ కమిటీకి నూతన నాయకత్వం – నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం – సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని ఎమ్మెల్యే పిలుపు

యాచారం, జూలై 12 (ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మల్కీజ్‌గూడ గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన బాధ్యుల నియామక కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోటె శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన బాధ్యులకు నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వరికుప్పల యాదయ్యను గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, వరికుప్పల అజయ్ను కార్యనిర్వహణ అధ్యక్షుడిగా, చీర శ్రీశైలంను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తూ ఎమ్మెల్యే స్వయంగా నియామక పత్రాలు అందించి అభినందించారు. నూతన బాధ్యులు పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు అర్హులందరికీ చేరేలా నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు అందజేయడానికి చర్యలు చేపడుతోందని తెలిపారు. అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పథకాలపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి లబ్ధిదారునికి సమాచారం చేరేలా పనిచేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తుందని, గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

నియామక పత్రాలు అందుకున్న గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన బాధ్యులు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విశ్వాసానికి తగిన విధంగా పనిచేస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తామని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.

గ్రామంలో నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, డీసీసీ ఉపాధ్యక్షుడు ముత్యాల వెంకటరెడ్డి, బీఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిల్లకంటి శేఖర్ రెడ్డి, సర్పంచులు దేంది రాంరెడ్డి, కేషమోని రాజు, ప్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ లిక్కి శ్రీనివాస్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోలమోని రామకృష్ణ యాదవ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం జయప్రకాష్, గ్రామ నాయకులు గౌరారం వెంకట్ రెడ్డి, చీర శేఖర్, ఉప సర్పంచ్ శిరీష వెంకటేష్ యాదవ్, వార్డు సభ్యులు చీర పద్మ మహేష్, మలిగ విక్రమ్, కొండల్, మాజీ అధ్యక్షులు కొత్తపల్లి జంగారెడ్డి, మధు, జీవన్, యాదయ్య, వెంకటేష్, శ్రీరాములు, సుధాకర్, మాజీ వార్డు సభ్యులు సాయిబాబా, త వెంకటేష్, యాదగిరి రెడ్డి, పంతులు నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.