మాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
బాధితుడు పి చంద్రమౌళి
కడప జులై.27 ( పున్నమి ప్రతినిధి)
నాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితుడు టీ చంద్రమౌళి అన్నారు. సోమవారం ఈ సందర్భంగా కడప రిమ్స్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లె హరిజనవాడ పరదేశి అలియాస్ సూర్యుడు తన కుమారుడు చంద్రమౌళి ఇద్దరిపై రెడ్డి కులానికి చెందిన కొందరు దాడి చేశారని వాపోయారు. అగ్రవర్ణాలైనా మమ్మల్ని హీనంగా తిడుతూ దాడి చేశారన్నారు. చికిత్స కోసం కడప రిమ్స్ లో చేరమన్నారు. భవిష్యత్తులో వారు నా కుటుంబానికి ఏదైనా ప్రాణహాని జరిగినట్టయితే వారిదే బాధ్యత అని కావున మా మీద దాడి చేసిన వారిని అధికారులు దయవుంచి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

