హనుమాన్ నగర్ ఫేజ్–2 కాలనీలో సాయి గణేష్ వినాయక కమిటీ అధ్యక్షులు శ్రీ గడ్డం గట్టయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా విజయవంతంగా పూర్తైంది.
ఈ మహా అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన కమిటీ సభ్యులకు, దాతలకు, కాలనీ పెద్దలకు, యువతకు, మహిళలకు, భక్తులకు మరియు ప్రతి ఒక్క కాలనీవాసికి సాయి గణేష్ వినాయక కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
అన్నదాన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని సేవలందించిన ప్రతి ఒక్కరి సహకారం ఎంతో విలువైనది. భక్తి, సేవాభావం, ఐక్యతతో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
శ్రీ వినాయకుని ఆశీస్సులు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఇట్లు
శ్రీ గడ్డం గట్టయ్య
అధ్యక్షులు
సాయి గణేష్ వినాయక కమిటీ

