నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు సంబంధించిన నకిలీ ప్రశ్నాపత్రాలు, మోసపూరిత సమాచారం వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అభ్యర్థన మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
అనేక టెలిగ్రామ్ గ్రూపులు నీట్ ప్రశ్నాపత్రాలు ముందుగానే అందిస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. దీంతో సైబర్ క్రైమ్ విభాగం, రాష్ట్ర పోలీసు శాఖలు కలిసి పలు గ్రూపులను తొలగించాయి. తాత్కాలికంగా సందేశాల ఎడిటింగ్ ఫీచర్ను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం సూచించింది.
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ఈ నిర్ణయాన్ని విమర్శించినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ కోసం ఈ చర్య అవసరమని NTA స్పష్టం చేసింది.


