రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు బోయకొండ గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించగా, తీర్థప్రసాదాలు, ఆలయ మర్యాదలతో సత్కరించారు. కార్యక్రమంలో రాజంపేట టౌన్ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, వైస్ ఏఎంసి చైర్మన్ కర్ణాటకం చెంగల్ రాయుడు, సీనియర్ నాయకులు కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీరబల్లి మండల నాయకులు పాల్గొన్నారు.




