నందిగామ, డిసెంబర్ 3:
వాసవి మాత విద్యాసేవ కార్యక్రమం లో భాగంగా ఆర్యవైశ్య సంఘం–నందిగామ ఆధ్వర్యంలో బీటెక్ విద్యార్థిని కి ఆర్థిక సహాయం అందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం బొబ్బెళ్ళపాడు గ్రామానికి చెందిన **కటకం హారిక (19)**కు చదువుల నిమిత్తం ₹66,987ను సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు ఈరోజు ఆమె ఇంటిలోనే స్వయంగా వెళ్లి అందజేశారు.
హారిక తల్లిదండ్రులు ఆ గ్రామంలో చిన్న ఇడ్లీ హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. విద్యలో ప్రతిభ కనబరుస్తూ మంచి మార్కులు సాధిస్తున్న హారిక బీటెక్ చదువు కొనసాగించాలన్న పట్టుదల ఉన్నప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలం కాక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న ఆర్యవైశ్య సంఘం ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొబ్బెళ్ళపాటి సాయి, నందిగామ ఆర్యవైశ్య సంఘం నాయకులు పారేపల్లి సాయిబాబు, ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొగ్గవరపు రాజారావు, ప్రధాన కార్యదర్శి నాళ్ల చిన సత్యంబాబు, సంఘ ప్రముఖులు మారం అమరయ్య, పులిపాటి శ్రీనివాస్, పబ్బతి జనార్దనరావు, చవట సుధాకర్, మొరిశెట్టి చైతన్య, చక్కా రాధాకృష్ణ, బిట్టు రమేష్, తిప్పారెడ్డి వేణు మాధవ్ రెడ్డి, కటకం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


