నెల్లూరు పొదలకూరు రోడ్డులోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వై.జే. పద్మశ్రీ బాల్య వివాహాల నిషేధ చట్టం, పిల్లల రాజ్యాంగ హక్కులు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యతను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలపై అవగాహన కల్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
నెల్లూరు పొదలకూరు రోడ్డులోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వై.జే. పద్మశ్రీ బాల్య వివాహాల నిషేధ చట్టం, పిల్లల రాజ్యాంగ హక్కులు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యతను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

