Monday, 29 June 2026
  • Home  
  • ప్రధాన రహదారిపై ఇసుక తొలగింపు రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన ఇసుక ర్యాంప్ యాజమాన్యం
- తూర్పు గోదావరి

ప్రధాన రహదారిపై ఇసుక తొలగింపు రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన ఇసుక ర్యాంప్ యాజమాన్యం

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూన్ 29: తాళ్లపూడి మండలంలోని ప్రధాన రహదారిపై ఇసుక లారీల నుంచి జారిపడి పేరుకుపోయిన ఇసుకను ఇసుక ర్యాంప్ యాజమాన్యం సిబ్బంది సోమవారం యుద్ధప్రాతిపదికన తొలగించారు. రహదారిపై ప్రయాణించే వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ చర్యపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై మేటలుగా పేరుకుపోయిన ఇసుకను కార్మికులు పారలతో తొలగిస్తూ, గంపలతో ఎత్తి రహదారిని పూర్తిగా శుభ్రం చేశారు. ఇసుక కారణంగా ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండటంతో ర్యాంప్ యాజమాన్యం వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ర్యాంప్ నిర్వాహకులు కొప్పాక కోట్నీస్ మాట్లాడుతూ, ఇసుక రవాణా జరిగే మార్గాలను ప్రతిరోజూ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రహదారిపై ఎక్కడైనా ఇసుక పడినట్లు సమాచారం అందిన వెంటనే కార్మికులను పంపించి శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు. అలాగే ఇసుకను టార్పాలిన్‌తో కప్పకుండా తరలించే లారీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. “రహదారిపై పడిన ఇసుక కారణంగా ద్విచక్ర వాహనాలు జారిపడి అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. యాజమాన్యం వెంటనే స్పందించి రహదారిని శుభ్రం చేయించడం అభినందనీయం. అన్ని ఇసుక ర్యాంపుల యాజమాన్యాలు కూడా ఇదే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని ఓ స్థానిక వాహనదారుడు అభిప్రాయపడ్డారు. “ప్రజల ప్రాణ భద్రతే మాకు అత్యంత ముఖ్యమైనది. రహదారి ప్రమాదాలు జరగకుండా మా వంతు బాధ్యతగా ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం. లారీ డ్రైవర్లు కూడా నిబంధనలు పాటిస్తూ ఇసుకను టార్పాలిన్‌తో కప్పి తరలించాలి” అని ఇసుక ర్యాంప్ యాజమాన్యం పేర్కొంది.

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జూన్ 29:
తాళ్లపూడి మండలంలోని ప్రధాన రహదారిపై ఇసుక లారీల నుంచి జారిపడి పేరుకుపోయిన ఇసుకను ఇసుక ర్యాంప్ యాజమాన్యం సిబ్బంది సోమవారం యుద్ధప్రాతిపదికన తొలగించారు. రహదారిపై ప్రయాణించే వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ చర్యపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రహదారిపై మేటలుగా పేరుకుపోయిన ఇసుకను కార్మికులు పారలతో తొలగిస్తూ, గంపలతో ఎత్తి రహదారిని పూర్తిగా శుభ్రం చేశారు. ఇసుక కారణంగా ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉండటంతో ర్యాంప్ యాజమాన్యం వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది.
ఈ సందర్భంగా ర్యాంప్ నిర్వాహకులు కొప్పాక కోట్నీస్ మాట్లాడుతూ, ఇసుక రవాణా జరిగే మార్గాలను ప్రతిరోజూ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రహదారిపై ఎక్కడైనా ఇసుక పడినట్లు సమాచారం అందిన వెంటనే కార్మికులను పంపించి శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు. అలాగే ఇసుకను టార్పాలిన్‌తో కప్పకుండా తరలించే లారీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
“రహదారిపై పడిన ఇసుక కారణంగా ద్విచక్ర వాహనాలు జారిపడి అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. యాజమాన్యం వెంటనే స్పందించి రహదారిని శుభ్రం చేయించడం అభినందనీయం. అన్ని ఇసుక ర్యాంపుల యాజమాన్యాలు కూడా ఇదే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని ఓ స్థానిక వాహనదారుడు అభిప్రాయపడ్డారు.
“ప్రజల ప్రాణ భద్రతే మాకు అత్యంత ముఖ్యమైనది. రహదారి ప్రమాదాలు జరగకుండా మా వంతు బాధ్యతగా ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం. లారీ డ్రైవర్లు కూడా నిబంధనలు పాటిస్తూ ఇసుకను టార్పాలిన్‌తో కప్పి తరలించాలి” అని ఇసుక ర్యాంప్ యాజమాన్యం పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.