సంగం మండలం జండాదిబ్బ అంగన్వాడీ కేంద్రంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఐదేళ్లలోపు చిన్నారులకు అధికారులు చుక్కలు వేశారు.
నెల్లూరు: సంగం మండలంలోని జండాదిబ్బ అంగన్వాడి స్కూల్ లో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అంగన్వాడి సీడీపీఓ సునీలత,సూపర్వైజర్ రమాదేవి స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు.ఐదేళ్ల లోపు ప్రతి ఒక్క చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాల్సిన అవసరం ఉందని, ఒక్క చిన్నారి కూడా మిస్సవకుండా తల్లిదండ్రులు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమానికి గ్రామ ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రుడు భాగస్వామి కావాలని సీడీపీఓ సునీలత సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త యం చెంచమౢ, ఏఎన్ఎం సుస్మిత,ఆశావర్కర్ బాగ్య లక్ష్మి.


