పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యమని లోక్ అదాలత్ జడ్జి వై.జె. పద్మశ్రీ తెలిపారు. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం కాలనీలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రకృతి పరిరక్షణలో భాగంగా చెట్ల సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, గుడ్డ సంచుల వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం గురుకుల కళాశాలలో బాలకార్మిక వ్యవస్థ, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, విద్యా హక్కు చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించి, సమస్యల కోసం 15100 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు.





