నెల్లూరు సెప్టెంబర్ 15 (పున్నమి ప్రతినిధి )
నెల్లూరు: (ఎన్ టీ ఆర్ )భరోసా పెన్షన్ల నమోదుకు గడువును వచ్చే నెల 25 వరకు పొడిగించాలని కోరుతూ వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కేవలం తొమ్మిది రోజులే గడువు ఇవ్వడంతో అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడం కష్టంగా మారిందని నాయకులు తెలిపారు. సర్వర్లు పనిచేయకపోవడం, సెలవు దినాలతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రీ-అసెస్మెంట్ చేసిన 60 శాతానికి పైగా దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందక పెన్షన్ల నమోదులో సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను గుర్తించిన జాయింట్ కలెక్టర్ గడువు పొడిగించాలని కోరుతూ (ఎస్ ఈ ఆర్ పి)
కార్యాలయానికి ఫ్యాక్స్ పంపారు. కార్యక్రమంలో ఎ.మునిశేఖర్ రెడ్డి, సామ్యూల్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.


