మహారాష్ట్రలోని పుణే జిల్లాలో మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 65 ఏళ్ల నిందితుడికి ప్రత్యేక పోక్సో కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసును “అత్యంత అరుదైన కేసు”గా పేర్కొన్న న్యాయస్థానం, నిందితుడి వయస్సును దృష్టిలో పెట్టుకుని శిక్ష తగ్గించాలన్న వాదనను తిరస్కరించింది. ఘటన జరిగిన 60 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించడం విశేషం. పోలీసులు 15 రోజుల్లోనే 1,200 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసి, 55 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు. వేగంగా న్యాయం అందించిన ఈ తీర్పు బాధిత కుటుంబానికి కొంత ఊరటనిచ్చిందని అధికారులు తెలిపారు.
పుణే చిన్నారి అత్యాచారం–హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష
మహారాష్ట్రలోని పుణే జిల్లాలో మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 65 ఏళ్ల నిందితుడికి ప్రత్యేక పోక్సో కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ కేసును “అత్యంత అరుదైన కేసు”గా పేర్కొన్న న్యాయస్థానం, నిందితుడి వయస్సును దృష్టిలో పెట్టుకుని శిక్ష తగ్గించాలన్న వాదనను తిరస్కరించింది. ఘటన జరిగిన 60 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి తీర్పు వెలువరించడం విశేషం. పోలీసులు 15 రోజుల్లోనే 1,200 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసి, 55 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించారు. వేగంగా న్యాయం అందించిన ఈ తీర్పు బాధిత కుటుంబానికి కొంత ఊరటనిచ్చిందని అధికారులు తెలిపారు.

